స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు సన్మానం
ABN , First Publish Date - 2022-08-15T06:28:15+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం చిత్తూరులోని స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే, అధికారులు సన్మానించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 14: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం చిత్తూరులోని స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే, అధికారులు సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధుడు కేజీ నరసింగరావు కుమారులు కె.ఎన్.శంకర్రావు, కె.ఎన్.సుభా్షబాబు, కోడళ్లు సుమిత్రాబాయి, జ్ఞానమణిని సత్కరించారు. మరో స్వాతంత్య్ర సమరయోధుడు బి.సుబ్రహ్మణ్యం మొదలియార్ కుమారులు శేఖర్, శివకుమార్ దంపతులను.. డి.శ్రీనివాస్ అయ్యంగార్ కుమారుడు డాక్టర్ ప్రసాద్ను సన్మానించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డీఆర్వో ఎన్.రాజశేఖర్, జడ్పీ సీఈవో ఎన్.ప్రభాకర్ రెడ్డి, ఆర్డీవో రేణుక, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రవీణ్, తహసీల్దార్ పార్వతి, ఐఅండ్ పీఆర్ డీడీ పద్మ తదితరులు వారికి శాలువా కప్పి, జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా తమ తండ్రులు స్వాతంత్ర్యోద్యమంలో చేసిన పోరాటాలను, సత్యాగ్రహాల గురించి వారు అధికారులతో పంచుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితగాథలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు నగరంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.