గిడుగు భాషా పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2022-08-26T01:44:22+05:30 IST

తెలుగు భాషా, సాహిత్య వికాసానికి కృషి చేస్తామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

గిడుగు భాషా పురస్కారాల ప్రదానం

తిరుపతి: తెలుగు భాషా, సాహిత్య వికాసానికి కృషి చేస్తామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా అకాడమీ తరపున ఆరుగురు ప్రముఖులకు గిడుగు భాషా పురస్కారాలను ప్రకటించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనేట్‌ హాల్‌లో ఈ పురస్కార ప్రదానోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటైందని తెలిపారు. తెలుగు, సంస్కృత భాషలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. అకాడమీకి టీటీడీ, ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయన్నారు. తెలుగు భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి గిడుగు భాషా పురస్కారాలను అందజేశామని లక్ష్మీపార్వతి తెలిపారు.

Updated Date - 2022-08-26T01:44:22+05:30 IST