కొవిడ్ తగ్గుముఖం... తిరుమలలో ఆంక్షలు సడలింపు
ABN , First Publish Date - 2022-02-22T17:47:03+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలలో టీటీడీ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.
తిరుమల: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలలో టీటీడీ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 24 నుంచి నిత్యం అదనంగా 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను రేపు(బుధవారం)ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది.