AP News : రేపు చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ టూర్ షెడ్యూల్ ఇదే..
ABN , First Publish Date - 2022-08-30T02:22:04+05:30 IST
తిరుపతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు లోకేష్ రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి
తిరుపతి : టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు లోకేష్ రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరు సబ్ జైలుకి చేరుకుంటారు. కుప్పంలో అన్న క్యాంటీన్పై వైసీపీ గూండాలు దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.సాయంత్రం 6.15 గంటలకు పెరుమాలపల్లె చేరుకొని రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాధ్ రెడ్డిని పరామర్శిస్తారు.