పేదలపై ఓటీఎస్ భారం తగదు
ABN , First Publish Date - 2022-01-15T07:02:31+05:30 IST
ఓటీఎస్ పేరిట ప్రభుత్వం పేదలపై భారం మోపడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి విమర్శించారు.
ఏర్పేడు, జనవరి 14: ఓటీఎస్ పేరిట ప్రభుత్వం పేదలపై భారం మోపడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి విమర్శించారు. మండలంలోని బండారుపల్లెలో శుక్రవారం ఓటీఎస్ రద్దు చేయాలని కోరుతూ ఆయన సంబంధిత జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం వేశారు. ఈ సందర్బంగా గురవారెడ్డి మాట్లాడుతూ వైసీపీ తీరుతో పేదలు సంతోషంగా పండుగ జరుపుకోలేని దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రభుత్వ కళ్లబొల్లి మాటలను నమ్మేస్థితిలో జనం లేరని ఎద్దేవా చేశారు.