కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీయడం దారుణం
ABN , First Publish Date - 2022-05-16T06:30:19+05:30 IST
వైసీపీ పాలనలో ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీసి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు రాజశేఖర్యాదవ్ విమర్శించారు.
రాష్ట్ర బీసీ హక్కుల పోరాటసమితి
పుంగనూరు, మే 15: వైసీపీ పాలనలో ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీసి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు రాజశేఖర్యాదవ్ విమర్శించారు. ఆదివారం పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిధులు లేని కార్పొరేషన్ల వల్ల ఒరిగింది ఏమీలేక పోగా కులాలను వేరుచేసి వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం నిర్లక్ష్యదోరణి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అడబిడ్డపై రోజురోజుకు హత్యాయత్నాలు పెరుగుతున్నాయన్నారు. పిల్లలకు రాష్ట్రానికి రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్బాగ్యస్థితిలో ఉన్నామన్నారు. బండి రామచంద్ర, రామలింగయ్య, ఎల్వీ రమణ, కృష్ణమూర్తి, గంపల గంగరాజు, సురేశ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.