కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకు ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-10-21T05:39:57+05:30 IST
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 7న కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకి ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు చిత్తూరు-1 డిపో మేనేజర్ ఎం.కృష్ణమూర్తి తెలిపారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబర్ 20 : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 7న కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకి ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు చిత్తూరు-1 డిపో మేనేజర్ ఎం.కృష్ణమూర్తి తెలిపారు. కాణిపాకం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. పెద్దవారికి రూ.300, పిల్లలకు రూ.170గా చార్జీలు నిర్ణయించామన్నారు. చిత్తూరు నుంచి పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.160 ఉంటుందన్నారు. తిరువణ్ణామలై నుంచి ఉదయం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చున్నారు.