పోలీసు పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవం
ABN , First Publish Date - 2022-01-22T05:18:00+05:30 IST
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించాలని జేసీ రాజశేఖర్ అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 21: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించాలని జేసీ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లబ్ధిదారులకు పంపిణీ చేసే ఆస్తి వివరాలను డీఆర్డీఏ పీడీ పర్యవేక్షించాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను ఈ సారి ప్రదర్శనలో ఉంచుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటింగ్ అరెంజ్మెంట్ చేయాలని సూచించారు. సమావేశంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.