నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-09-25T04:52:39+05:30 IST
రెండో దశ నాడునేడు పనులను వేగవంతం చేయాలని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ భాస్కర్ ఆదేశించారు.
చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 24: రెండో దశ నాడునేడు పనులను వేగవంతం చేయాలని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ భాస్కర్ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి డీఈవో, ఎస్ఎస్ ఏపీసీ, ఇంజనీరింగ్ విభాగం అఽధికారులతో ఆయన వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు నాణ్యతతో ఉండాలన్నారు. అంచనాల నివేదికలను మంగళవారం లోపు ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అంచనాలు తయారు చేయాలని సూచించారు. చిత్తూరు నుంచి డీఈవో పురుషోత్తం వెబెక్స్లో పాల్గొన్నారు.