బాలత్రిపురసుందరిదేవిగా మరగదాంబిక
ABN , First Publish Date - 2022-10-03T05:30:00+05:30 IST
కాణిపాకంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం బాలత్రిపురసుందరిదేవి అవతారంలో మరగదాంబిక భక్తులకు దర్శనమిచ్చారు.
కాణిపాకంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం బాలత్రిపురసుందరిదేవి అవతారంలో మరగదాంబిక భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మణికంఠేశ్వరస్వామి ఆలయంలోని మరగదాంబికకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం ఆలయ ఆవరణంలో భక్తుల చేత కుంకుమార్చన నిర్వహింప చేశారు. రాత్రి మరగదాంబికదేవి ఉత్సవ మూర్తిని కాణిపాకం పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విద్యాసాగర్రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకుడు సోమశేఖర్గురుకుల్, ఆలయ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
- ఐరాల(కాణిపాకం)
======================