మదనపల్లె టీడీపీకి కంచుకోట అని నిరూపిద్దాం
ABN , First Publish Date - 2022-01-17T05:54:22+05:30 IST
మదనపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని నిరూపిద్దామని టీడీసీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి సూచించారు.
మదనపల్లె టౌన్, జనవరి 16: మదనపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని నిరూపిద్దామని టీడీసీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి సూచించారు. ఆదివారం శాస్త్రివీధిలోని బాబురెడ్డి నివాసంలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు శాలువ కప్పి బాబురెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో తెలుగు యువత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఆర్.గురుప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్రెడ్డి, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు విష్ణు, నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్తేజ్, మూడు మండలాల నుంచి పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.