భూములు సేకరించి అల్పాదాయ వర్గాలకు అమ్మకం

ABN , First Publish Date - 2022-12-07T00:08:56+05:30 IST

అల్పాదాయ వర్గాల ప్రజలకు చౌక ధరకే ఇళ్ళ స్థలాలు కేటాయించేందుకు చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(చుడా) పరిధిలో భూసేకరణ మొదలుపెట్టారు.

భూములు సేకరించి అల్పాదాయ వర్గాలకు అమ్మకం
భూయజమానులతో మాట్లాడుతున్న జేసి వెంకటేశ్వర్‌

--నష్టపరిహారంపై భూయజమానుల అసంతృప్తి

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 6: అల్పాదాయ వర్గాల ప్రజలకు చౌక ధరకే ఇళ్ళ స్థలాలు కేటాయించేందుకు చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(చుడా) పరిధిలో భూసేకరణ మొదలుపెట్టారు. చిత్తూరు నగరానికి సమీపంలోని కోడిగుట్టపల్లె వద్ద 35 ఎకరాలు, పూతలపట్టు సమీపంలోని వడ్డేపల్లి వద్ద 26.3 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ విధానం ద్వారా సేకరించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం భూమి యజమానులకు పరిహారం చెల్లిస్తారు. ఈ మేరకు భూయజమానులతో జేసీ వెంకటేశ్వర్‌ సమావేశమయ్యారు. భూమి యజమానులు మాత్రం ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గిట్టుబాటు కాదని స్పష్టం చేశారు. చుడా వైస్‌ చైర్మన్‌ విశ్వనాథ్‌, ఆర్డీవో రేణుక, పూతలపట్టు తహసీల్దార్‌ విజయభాస్కర్‌, రెండు ప్రాంతాల రైతులు ఈ సమావేశంలో ు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:08:57+05:30 IST