వైద్య సిబ్బందికి సన్మానం
ABN , First Publish Date - 2022-01-18T05:59:53+05:30 IST
శ్రీకాళహస్తిలోని గజేంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బందిని బీజేపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ తదితరులు సన్మానించారు.
శ్రీకాళహస్తి, జనవరి 17: పట్టణ గజేంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బందిని సోమవారం బీజేపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం మోదీ నేతృత్వంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి ఏడాదయిందని గుర్తుచేశారు. ప్రజలు కరోనా నివారణకు సహకరించాలనీ, మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్, నాయకులు వజ్రం కిషోర్, పద్మజ, చిలకా రంగయ్య, గరికపాటి రమేష్బాబు, కన్నా వెంకటేశ్వర్లు, గోపాల్, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు.