పంటపొలాలపై ఒంటరి ఏనుగు విధ్వంసం
ABN , First Publish Date - 2022-01-21T05:24:04+05:30 IST
మండలంలోని గాంధీనగర్, బండమీద జరావారిపల్లె గ్రామాల పరిధిలోని పంటపొలాలపై బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది
గంగవరం, జనవరి 20 : మండలంలోని గాంధీనగర్, బండమీద జరావారిపల్లె గ్రామాల పరిధిలోని పంటపొలాలపై బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఒంటరి ఏనుగు గాంధీనగర్ సమీపంలోని అటవీ సరిహద్దు పొలాలపై విరుచుకుపడింది. పనస చెట్లతోపాటు, మామిడిచెట్లను విరిచి, పశువుల గడ్డిని తొక్కి నాశనం చేసింది. పక్కనే ఉన్న బండమీదజరావరిపల్లె వైపు వెళ్లి వరిపంటను ఆరగించి తొక్కి నాశనం చేసింది. ఈ దాడుల్లో అమ్ములు, రాజగోపాల్, వసరాయప్ప, కృష్ణప్పలకు చెందిన పనస, మామిడి, పశువుల గడ్డి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఏనుగుల దాడులను అరికట్టేలా శాశ్వత చర్యలు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు.