శ్రీవారికి రూ.1.30 కోట్ల స్వర్ణాభరణాల విరాళం
ABN , First Publish Date - 2022-12-30T02:59:03+05:30 IST
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి గురువారం కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలు విరాళంగా అందాయి.
తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి గురువారం కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలు విరాళంగా అందాయి. తిరుపతి, చిత్తూరులోని కేవీఆర్ జ్యువెలర్స్ వ్యవస్థాపకులు కె.ఆర్.నారాయణమూర్తి, స్వర్ణగౌరి దంపతులు కు టుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను తిరుమల ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్కు అందజేశారు. సుమారు 1,756 గ్రాము ల బరువున్న ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు.