రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
ABN , First Publish Date - 2022-12-07T00:00:00+05:30 IST
రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్పను నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.
పుంగనూరు రూరల్, డిసెంబరు 6: రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్పను నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప స్పీకర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తనను నియమించడానికి కృషి చేసిన ఎంపీ మిథున్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.