Chittoorలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం...వైసీపీ ధర్నా
ABN , First Publish Date - 2022-01-15T15:45:42+05:30 IST
జిల్లాలోని ఎస్ఆర్పురం మండల కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు.
చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్పురం మండల కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, వైసీపీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు పుత్తూరు రోడ్డుపై వైసీపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.