తిరుమలలో బంగార్రాజు
ABN , First Publish Date - 2022-01-22T06:40:02+05:30 IST
శ్రీవారిని దాదాపు రెండేళ్ల తర్వాత దర్శించుకున్నానని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. తన సతీమణితో కలిసి శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
తిరుమల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీవారిని దాదాపు రెండేళ్ల తర్వాత దర్శించుకున్నానని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. తన సతీమణితో కలిసి శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ఇప్పటికి స్వామి దర్శనం లభించిందన్నారు. స్వామిని దర్శించుకుని అందరూ బాగుండాలని ప్రార్థించానని చెప్పారు. కాగా.. ఆలయం ముందు నాగార్జున దంపతులను చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఉత్సాహం చూపారు.