యువకుడిపై బ్లేడుతో దాడి
ABN , First Publish Date - 2022-09-27T05:09:18+05:30 IST
స్థానిక కోనేటిమిట్ట ప్రాంతంలో సోమవారం ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.
గూడూరు, సెప్టెంబరు 26: స్థానిక కోనేటిమిట్ట ప్రాంతంలో సోమవారం ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు... ఆదివారం రాత్రి కోనేటమిట్ట ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు ఓ దుకాణం వద్ద ఉండగా అదేప్రాంతానికి చెందిన వంశీ అనే యువకుడితో పాతగొడవల నేపథ్యంలో మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. వంశీ వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీకాంత్ సోమవారం వంశీతో మాట్లాడేందుకు వెళ్లాడు. కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీకాంత్, వంశీ మధ్య వివాదం చెలరేగడంతో వంశీ బ్లేడుతో శ్రీకాంత్ మెడపై దాడి చేశాడు. శ్రీకాంత్కు గాయాలయ్యాయి. అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంక టేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్ఐ పవన్కుమార్ కేసునమోదు చేశారు.