ఉమామహేశ్వరిని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-25T06:59:07+05:30 IST
చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పీలేరు, జనవరి 24: చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ నాలుగు రోడ్ల కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సస్పెన్షన్తో సరిపోదని గుర్తుచేశారు. ఇందులో తప్పుడు ఫిర్యాదు చేసిన జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్రెడ్డి, పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళపై థర్డ్డిగ్రీ ఉపయోగించడం దారుణమనీ, బాధితురాలికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ధరణికుమార్, శ్రీనివాసులు, మహేష్, బోదేషావలి, మౌలా, సుభాష్, మల్లికార్జున, వెంకట్రామయ్య పాల్గొన్నారు.