పాము కాటుతో మూడేళ్ల చిన్నారి మృతి
ABN , First Publish Date - 2022-08-20T06:04:11+05:30 IST
పాము కాటుకు గురై మూడేళ్ల పాప మృతి చెందింది.పెళ్లకూరు మండలం దిగువ చావాలి దళితవాడకు చెందిన దంపతులు పిగిలాం రాజేష్,అనిత పెద్ద కుమార్తె హరశ్రీ (3) గురువారం రాత్రి తండ్రితో కలసి మంచంపై నిద్రిస్తుండగా 12గంటలకు నాగుపాము చేతిపై కాటు వేసింది.
పెళ్లకూరు, ఆగస్టు 19 : పాము కాటుకు గురై మూడేళ్ల పాప మృతి చెందింది.పెళ్లకూరు మండలం దిగువ చావాలి దళితవాడకు చెందిన దంపతులు పిగిలాం రాజేష్,అనిత పెద్ద కుమార్తె హరశ్రీ (3) గురువారం రాత్రి తండ్రితో కలసి మంచంపై నిద్రిస్తుండగా 12గంటలకు నాగుపాము చేతిపై కాటు వేసింది. దీంతో చిన్నారి కేకలు వేయడంతో మేల్కొన్న తల్లిదండ్రులు పాప చేతిపై ఉన్న కాట్లను చూసి హుటాహుటిన నాయుడుపేట ఆస్పత్రికి బయల్దేరారు.అయితే మార్గమధ్యంలోనే హరశ్రీ మృతి చెందింది.శుక్రవారం ఉదయం ఇంటి పరిసరాల్లో గాలించగా ఇంటిపై నున్న రేకులపై నాగుపాము కనబడితే హతమార్చారు.