కార్వేటినగరం వాసి గ్రూప్ 1కు ఎంపిక
ABN , First Publish Date - 2022-07-06T07:19:00+05:30 IST
కార్వేటినగరం తూర్పు అరుంధతివాడకు చెందిన కలిశెట్టి ప్రసాద్ గ్రూపు 1కు ఎంపికయ్యాడు.
కార్వేటినగరం జూలై 5 : కార్వేటినగరం తూర్పు అరుంధతివాడకు చెందిన కలిశెట్టి ప్రసాద్ గ్రూపు 1కు ఎంపికయ్యాడు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు వెంకటాచలం, రాజమ్మ రోజువారీ కూలీలు. కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని బాగా చదివించారు. మదనపల్లె నవోదయ స్కూల్లో ఇంటర్ వరకు చదివాడు. ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. దళితవాడలోని పేద కుటుంబం నుంచి నుంచి గ్రూపు 1కు ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.