బీసీ గర్జన సభకు 60 ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2022-12-07T00:05:48+05:30 IST
విజయవాడలో బుధవారం జరగనున్న జయహో బీసీ మహాసభకు చిత్తూరు జిల్లా నుంచి 60 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. 7 డిపోల పరిధిలో 8 చొప్పున బస్సులను మహాసభకు కేటాయించారు.
చిత్తూరు రూరల్, డిసెంబరు 6: విజయవాడలో బుధవారం జరగనున్న జయహో బీసీ మహాసభకు చిత్తూరు జిల్లా నుంచి 60 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. 7 డిపోల పరిధిలో 8 చొప్పున బస్సులను మహాసభకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే చాలా ప్రాంతాల్లో సర్వీసులు నడవక ఇబ్బందులు పడుతుంటే మహాసభ పేరుతో బస్సులను కేటాయించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.