Chandrababu: రైల్వే శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-11-11T16:26:55+05:30 IST

కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.

Chandrababu: రైల్వే శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ
Chandrababu

చిత్తూరు: కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. ఈ లేఖను వందేభారత్ రైలు చీఫ్‌ కమర్షియల్ మేనేజర్‌కు టీడీపీ నేతలు అందించారు. 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్‌గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ (Dravidian University), పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు.. నిత్యం కర్ణాటక (Karnataka), తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.

Updated Date - 2022-11-11T16:27:06+05:30 IST