రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-23T05:58:17+05:30 IST
మండలంలోని చాకర్లపల్లి రైల్వేస్టేషన సమీపంలో మంగళవారం రైలుకిందపడి సోమందేపల్లికి చెందిన యువకుడు గణేష్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమందేపల్లి, ఫిబ్రవరి 22: మండలంలోని చాకర్లపల్లి రైల్వేస్టేషన సమీపంలో మంగళవారం రైలుకిందపడి సోమందేపల్లికి చెందిన యువకుడు గణేష్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. సాయంత్రం హైదరాబాద్ వైపు వెళ్లే రైలు కింద పడటంతో గణేష్ శరీరం ఛిద్రమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.