అన్యాయం చేసి బీసీ సభలు పెడతారా?: టీడీపీ
ABN , First Publish Date - 2022-12-07T00:14:10+05:30 IST
బీసీలకు తీరని అన్యాయం చేసి, సభలు నిర్వహించడం సిగ్గుచేటని టీడీపీ బీసీ సెల్ నాయకులు మండిపడ్డారు.
అనంతపురం అర్బన, డిసెంబరు 6: బీసీలకు తీరని అన్యాయం చేసి, సభలు నిర్వహించడం సిగ్గుచేటని టీడీపీ బీసీ సెల్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా టీడీపీ కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లల్లో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల కార్పోరేషన్లను ఏర్పాటు చేశారే కానీ, ఒక్క పైసా కూడా నిఽధులు విడుదల చేయలేదన్నారు. టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం బీసీలంతా శక్తి వంచనలేకుండా కృషి చేసేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ విశాలాక్షి, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, బీసీ సెల్ జిల్లాప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహులు, కురబ సాధికార సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు.