వైసీపీకి ఓట్లేసి మోసపోయాం

ABN , First Publish Date - 2022-12-31T00:16:35+05:30 IST

వైసీపీకి ఓట్లేసి మోసపోయా మని పలువురు ప్రజలు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఎదుట ఆవేదన చెందారు. శుక్రవారం నగరంలోని 17వ డివిజనలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ప్రభాకర్‌ చౌదరి పాల్గొన్నారు.

వైసీపీకి ఓట్లేసి మోసపోయాం

- మాజీ ఎమ్మెల్యే ఎదుట ప్రజల ఆవేదన

అనంతపురం అర్బన, డిసెంబరు 30: వైసీపీకి ఓట్లేసి మోసపోయా మని పలువురు ప్రజలు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఎదుట ఆవేదన చెందారు. శుక్రవారం నగరంలోని 17వ డివిజనలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ప్రభాకర్‌ చౌదరి పాల్గొన్నారు. డివిజనలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అన్ని రకాలుగా ధరలు పెంచి ఆర్థికంగా ఇబ్బంది పెడుతు న్నారని పలువురు మహిళలు, చిరు వ్యాపారులు మాజీ ఎమ్మెల్యే ఎదుట ఆవేదన చెందారు. ఏడాదికి రూ.10వేలు ఇస్తూ ట్యాక్స్‌ రూపంలో రూ.11వే లు వసూలు చేస్తు న్నారని ఆటో డ్రైవర్‌ వాపో యాడు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా మీరు చేసిన అభివృద్ది ఇప్పటికీ గుర్తుందని, వచ్చేఎన్నికల్లో టీడీపీకే ఓటు వేస్తామని మరికొందరు మహిళలు, స్థానికులు స్పష్టం చేయడం గమనార్హం. కార్యక్ర మంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, తలారి ఆదినారాయణ, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, మారుతీకుమార్‌ గౌడ్‌, దళవాయి వెంకటనారాయణ, సిమెంట్‌ పోలన్న, పెద్దమారెప్ప, రాజా రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:16:37+05:30 IST