దాడులను ఖండిస్తునాం
ABN , First Publish Date - 2022-06-30T05:46:15+05:30 IST
రాజకీయ విభేదాల నేపథ్యంలో దాడులు చేయడం సరికాదనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య
ధర్మవరం, జూన 29: రాజకీయ విభేదాల నేపథ్యంలో దాడులు చేయడం సరికాదనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు. సీపీఐ స్థానిక కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడారు.. బీజేపీ నాయకులపై దాడి నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయప్ప, రైతుసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, సీపీఐ నాయకులు వెంకటనారాయణ, వెంకటస్వామి పాల్గొన్నారు.