బడిలో నీటి కష్టం

ABN , First Publish Date - 2022-12-07T01:17:47+05:30 IST

యాడికి మండల పరిధిలోని వీరన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ఆవరణలోని చేతిపంపు ఎండిపోయింది. కొళాయికి చాలాకాలంగా నీరు రావడం లేదు. దీంతో తాగునీటికి, మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

బడిలో నీటి కష్టం
పాఠశాలలోని విద్యార్థులు, పక్కనే నీటి బిందెలు

యాడికి మండల పరిధిలోని వీరన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ఆవరణలోని చేతిపంపు ఎండిపోయింది. కొళాయికి చాలాకాలంగా నీరు రావడం లేదు. దీంతో తాగునీటికి, మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల అవసరాలకు నిత్యం బిందెల్లో నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అర కి.మీ. దూరంలో, ఊరి చివరన ఉన్న కొళాయి నుంచి విద్యార్థులు తాగు నీటిని తెచ్చుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పాఠశాల ప్రహారీ నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. దీంతో తరగతి గదిలోకి పాములు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. పాఠశాల సమస్యలను అధికారులు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- యాడికి

Updated Date - 2022-12-07T01:18:00+05:30 IST