వేధింపులు భరించలేక చంపేశాం

ABN , First Publish Date - 2022-03-05T06:21:55+05:30 IST

రోజూ మద్యం తాగి అందరినీ అనుమా నిస్తూ వేధిస్తుండటంతో భరించ లేక అందరం కలిసి రమేష్‌ను చంపేశామని పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్నారు

వేధింపులు భరించలేక చంపేశాం

పోలీసుల విచారణలో నిందితులు

 డీ హీరేహాళ్‌, మార్చి 4: రోజూ మద్యం తాగి అందరినీ అనుమా నిస్తూ వేధిస్తుండటంతో భరించ లేక అందరం కలిసి రమేష్‌ను చంపేశామని పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్నారు. ఎస్‌ఆ ర్‌ కోట గ్రామానికి చెందిన రమేష్‌ ను గతనెల 27వ తేదీన ఇంట్లో చీరతో గొంతునులిమి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా భార్యలు నాగరత్న మ్మ, మంజుల, మృతుడి అన్న పెన్నయ్య, అక్క గంగమ్మ కలిసి చంపినట్లు ఒ ప్పుకున్నట్లు సీఐ యుగంధర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు రమే ష్‌ ప్రతిరోజూ మద్యం తాగి తన ఇద్దరు భార్యను అనుమానిస్తూ రోజూ వేధిం చేవాడు. వీరితోపాటు అక్క గంగమ్మపై కూడా నిందలు వేసి హింసిం చేవాడు. దీంతో 27వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చిన రమేష్‌ను ఇంట్లోని పాతచీ రతో గొంతుకు గట్టిగా బిగించి చంపి వేశారు.  ఎవరికీ అనుమానం రాకుండా వుండేం దుకు గ్రామ సమీపంలోని బావిలో మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడే శారు. దీనిపై విచారిస్తుండగా భయపడిన ఆ నలుగురు నేరాన్ని ఒప్పు కుని శుక్ర వారం పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. దీంతో వీరిని రాయ దుర్గం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రామకృ ష్ణారెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-03-05T06:21:55+05:30 IST