నెట్టికంటిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి
ABN , First Publish Date - 2022-12-08T00:29:49+05:30 IST
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని హంపి పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పీఠాధిపతికి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పీఠాధిపతి స్వామి వారిని దర్శించుకున్నారు.
గుంతకల్లు టౌన, డిసెంబరు 7: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని హంపి పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పీఠాధిపతికి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పీఠాధిపతి స్వామి వారిని దర్శించుకున్నారు. పీఠాధిపతి పేరిట అర్చకులు స్వామివారికి అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ నలుగురు సేవా సమితి వ్యవస్థాపకుడు మంజులా వెంకటేష్, సమితి సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.