తెలుగుదేశంతోనే రాష్ట్ర భవిష్యత్తు : గుండుమల
ABN , First Publish Date - 2022-06-28T06:23:04+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీతోనే భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిర టౌన, జూన 27: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీతోనే భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. స్థానిక బాలాజీ నగర్ పార్టీ కార్యాలయంలో సోమవారం మండలంలోని కల్లుమర్రి పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. వైసీపీ నాయకులు కోట్ల అనిల్కుమార్రెడ్డి, సోమశేఖర్రెడ్డి తమ అనుచరులతో టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడు తూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు... రాష్ట్ర భవిష్యత్తును మార్చుతారన్న అశతో జనం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అఽధ్యక్షుడు మనోహర్, మైనార్టీ జిల్లా అ ధ్యక్షుడు భక్తర్, పట్టణ యువత అధ్యక్షులు తిమ్మరాజు పాల్గొన్నారు.