వైసీపీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి

ABN , First Publish Date - 2022-12-07T00:06:05+05:30 IST

వైసీపీని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని, సీఎం జగన్మోహనరెడ్డి అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలు చాలా విసిగి పోయారని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

బుక్కపట్నం, డిసెంబరు 6: వైసీపీని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని, సీఎం జగన్మోహనరెడ్డి అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలు చాలా విసిగి పోయారని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండల పరిధిలోని క్రిష్ణాపురం, గోపాలపురం గ్రామాల్లో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ... మూడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. జగన పాలనలో దోచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే రానున్న ఎన్నికలలో వైసీపీకి తగిన బుద్ధిచెప్పి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ ప్రభుత్వం రైతుల పొలాల్లో విద్యుత మోటార్లు బిగిస్తోందని, ఇక్కడ అలా జరిగితే వాటిని ధ్వంసం చేయాలని రైతులకు సూచించారు. టీడీపీ హయాంలో ప్రజలకు మేలైన పాలన అందించామని, మూడున్నరేళ్లలో అరాచకం తప్ప చేసిందేమీ లేదన్నారు. మద్యపా నాన్ని నిషేధిస్తామని ఎన్నికల హామీల్లో చెప్పిన జగన రాష్ట్రంలో నాసిరకం మద్యా న్ని ఏరులై పారిస్తున్నారన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వర్షాలతో పంటలు నష్టపోతే కనీసం వారి గురించి పట్టించుకునే నాథుడే లేరన్నారు. టీడీపీ హయాంలో పంటలు దెబ్బతింటే వెంటనే ఇనపుట్‌ సబ్సిడీ అందించేవారమన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని రానున్న రోజుల్లో టీడీపీ ఘన విజయం సాధంచడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చింతామల్లిరెడ్డి, నాయకులు మీసాల మురళి, గంగాధర్‌, పల్లపు రవీంద్ర, శ్రీరాములు, రామాంజి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:06:09+05:30 IST