నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-12-07T00:07:17+05:30 IST
కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు.
కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు డీఈఓ హెచ్చరిక
అనంతపురం విద్య, డిసెంబరు 6: కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుక్కరాయసముద్రం కేజీబీవీలో మంగళవారం ప్రిన్సిపాళ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓతో పాటు ఏపీసీ తిలక్ విద్యాసాగర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శింగనమల కేజీబీవీలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. లేకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంఓ హరికృష్ణ, జీసీడీఓ రెబెకా తదితరులు పాల్గొన్నారు.