బాలిరెడ్డిపల్లి వాసుల శ్రమదానం

ABN , First Publish Date - 2022-09-24T04:58:15+05:30 IST

మండలం బాలిరెడ్డిపల్లి వాసులు స్వచ్ఛందంగా కదలివ చ్చి గ్రామానికి తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. దశాబ్దాల కాలంగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు.

బాలిరెడ్డిపల్లి వాసుల శ్రమదానం
గ్రామస్థులు నిర్మించిన తాత్కాలిక వంతెన

పెన్నానదిపై తాత్కాలిక వంతెన ఏర్పాటు


పరిగి, సెప్టెంబరు 23: మండలం బాలిరెడ్డిపల్లి వాసులు స్వచ్ఛందంగా కదలివ చ్చి గ్రామానికి తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. దశాబ్దాల కాలంగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇ టీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని పెన్నానది ప్రవహిస్తోంద. దీంతో రాకపోకలు స్తంభించాయి. గ్రామానికి కనీసం 108 అంబులెన్స కడా వెళ్లడానికి వీలులేకుండా పోయింది. వేరే దారి నుంచి వెళ్లాలంటే రోడ్డు సరిగా లేదు. దీంతో గ్రామస్థు లందరూ కలిసికట్టుగా నడుంబిగించారు. గ్రామంలోని సిమెంట్‌ పైపులను పెన్నానదికి వేసి మట్టి తోలి తాత్కాలిక వంతెన నిర్మించారు. దీంతో ఈమార్గంలో రాకపోకల ను పునరుద్ధరించుకున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తాత్కాలి క వంతెన నిర్మాణాన్ని తామే స్వయంగా చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. 


Updated Date - 2022-09-24T04:58:15+05:30 IST