కసాపురంలో సింధూర అర్చన
ABN , First Publish Date - 2022-12-22T23:06:03+05:30 IST
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సింధూర అర్చన నిర్వహించారు.
గుంతకల్లుటౌన్, డిసెంబరు 22: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సింధూర అర్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు. వేదపం డితుడు రామకృష్ణ అవధాని, అర్చకులు ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తికి సింధూర అర్చన నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.