బటన్లు నొక్కితే అభివృద్ధి అవుతుందా?: సాకే శైలజానాధ్
ABN , First Publish Date - 2022-07-30T00:44:13+05:30 IST
Vijayawada: ఏపీసీసీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడు సాకే శైలజానాధ్ (Sake Sailajanath) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి పరిమితమై అక్కడి
Vijayawada: ఏపీసీసీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడు సాకే శైలజానాధ్ (Sake Sailajanath) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి పరిమితమై అక్కడి నుంచే బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. డీబీటీ (DBT) పేరుతో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లా? అని ప్రశ్నించారు. అమరావతిని ముందు అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.