గ్రామాలకు చేరని స్వచ్ఛ సంకల్ప ట్రై సైకిళ్లు
ABN , First Publish Date - 2022-12-10T00:05:52+05:30 IST
జగనన్న హౌసింగ్ లేఔట్లో ఈ నెలాఖరు లోగా ప్రతి ఇంటి గ్రౌండింగ్ కావాలని జిల్లా కలెక్టర్ బసంతకుమార్ అధికారుల ను ఆదేశించారు.
ధర్మవరం రూరల్, డిసెంబరు 9: జగనన్న హౌసింగ్ లేఔట్లో ఈ నెలాఖరు లోగా ప్రతి ఇంటి గ్రౌండింగ్ కావాలని జిల్లా కలెక్టర్ బసంతకుమార్ అధికారుల ను ఆదేశించారు. ఆయన శుక్రవారం ధర్మ వరం మండలంలోని పోతులనాగేపల్లి వద్ద జగనన్న హౌసింగ్ లేఔట్ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ్ల కలెక్టర్ మాట్లాడుతూ... ఈ లేఔట్లో ఇప్పటి 2038 ఇళ్లు మంజూర య్యారన్నారు. వరకు 64్ల పూర్తయ్యాయని, 99నాన స్టార్టెడ్లో ఉండగా మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయన్నారు. అక్కడే అర్బనకు చెందిన మరో లేఔట్లో 2,118 ఇళ్లు మంజూరుకాగా... 685 ప్రారంభమే కాలేదనీ, మూడు ఇళ్లు పూర్తయ్యాయన్నా రు. ఇంటి నిర్మాణాలను ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. నెలాఖారులోగా పూర్తిస్థాయిలో మొదలు పెట్టాలన్నారు. ఈనెల 21వ తేదీ నాటికి లేఔట్లలో విద్యుత, నీటి సరఫరా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ ఇనచార్జి పీడీ రాజశేఖర్, డీఈ మునీశ్వరనాయుడు, ఏఈ బాలాజీ, మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి, ఇనచార్జి తహసీల్దార్ యుగేశ్వరీదేవి, హౌసింగ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.