జై హనుమాన..
ABN , First Publish Date - 2022-08-22T05:13:55+05:30 IST
మకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు.
నేమకల్లులో వైభవంగా బ్రహ్మరథోత్సవం
బొమ్మనహాళ్, ఆగస్టు 21: నేమకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణుపారాయణం, అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం ఉదయం మడుగు తేరును లాగి, సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు తరలివచ్చారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శివ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, సర్పంచ పరమేష్, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ బెళ్లి హనుమంతరెడ్డి, గాలి బసప్ప, మాజీ ధర్మకర్త శాంతయ్య పాల్గొన్నారు.