ప్రజా సమస్యల పరిష్కరంలో జగన ఫెయిల్‌

ABN , First Publish Date - 2022-12-07T00:01:53+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగన మోహన రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కరంలో జగన ఫెయిల్‌

- మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం రూరల్‌, డిసెంబరు6: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగన మోహన రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. మండలంలోని రుద్రంపేట, మధర్‌థెరిసా, ఎస్సీ కాలనీల్లో ‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ..ప్రజలతో మాట్లాడుతూ స్థానిక సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నోట్లతో ఓట్లు కొనుగోలు చేయాలని వైసీపీ చూస్తోందన్నారు. ఓటుకు రూ.10వేలు ఇస్తారన్న ప్రచారం సాగుతోందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును పంచేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖచ్చితంగా సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, రాష్ట్ర కార్యదర్శులు దేవళ్లమురళి, జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌నాగరాజు, నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, మారుతికుమార్‌ గౌడ్‌, విశాలాక్షి, శివబాల, తేజస్విణి, గుర్రంనాగభూషణం, చంటి, కూచిహరి, శ్రీనివాసచౌదరి, గోపాల్‌ గౌడ్‌, వెంకటనారాయణ, శేఖర్‌, అజీజ్‌, శివ, రమణ, కదిరప్ప, ఎస్‌ఎంభాష, మురళీ, విజయ్‌, వరుణ్‌, అంజి, కుమార్‌, సుధాకర్‌గౌడ్‌, ఎర్రిస్వామి, తెలుగు మహిళలు సరళ, షరీన, వసుంధర, మహేశ్వరీ, కృష్ణవేణి, దేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:01:55+05:30 IST