వార్డెన్ల బదిలీల్లో అవకతవకలు
ABN , First Publish Date - 2022-07-06T06:34:17+05:30 IST
ఎస్సీ సంక్షేమ శాఖ వార్డెన్ల బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు
విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాల డిమాండ్
అనంతపురం ప్రెస్క్లబ్, జూలై 5: ఎస్సీ సంక్షేమ శాఖ వార్డెన్ల బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే రీ-ట్రాన్సఫర్స్ జరిపి నిబంధనల మేరకు బదిలీలు జరపాలని ఆ శాఖ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మిని కోరారు. ఈ మేరకు మంగళవారం రీ-బదిలీలు నిర్వహించాలని కోరుతూ ఆ శాఖ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, అఖిల భారత విద్యార్థి బ్లాక్ పాపిరెడ్డిపల్లి పృధ్వి మాట్లాడారు. తాజాగా జరిగిన బదిలీల్లో డీడీ విశ్వమోహనరెడ్డి ఎనిమిది మంది వార్డెన్లను సొంత మండలాలకే బదిలీచేసి.. మరికొంత మందిని ఇష్టానుసారంగా బదిలీ చేశారని మండిపడ్డారు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే అనుకూలంగా బదిలీలు చేసి... మిగిలిన వార్డెన్లకు అన్యాయం చేశారన్నారు. కావున ఈ విషయంలో జిల్లా కలెక్టర్, జేసీలు చొరవ తీసుకొని రీ-ట్రాన్సఫర్సర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధు, శాంతకుమార్, గురు మోహన, ముడ్లరాము, కృష్ణ, రామాంజనేయలు పాల్గొన్నారు.