Anantapur జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-13T17:21:56+05:30 IST
జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతపురం: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ద్విచక్ర వాహనంలో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, కాల్వ శ్రీనివాసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాకో నిబంధన ఉంటుందా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పీనల్ కోడ్ అమలు అవుతుందంటూ మాజీ మంత్రి మండిపడ్డారు. కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో కాల్వ శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు. చివరకు కలెక్టర్ వద్దకు కాల్వ శ్రీనివాసులుతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అనుమతించారు.