Ap News: అక్రమాలకు పాల్పడ్డ తహశీల్దార్, ఇద్దరు ఎస్‌ఐలపై కేసు

ABN , First Publish Date - 2022-12-31T15:51:07+05:30 IST

పుట్లూరు మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌ (MRO)తో పాటు మరో ఇద్దరు ఎస్ఐల (SI)పై కేసు నమోదైంది. ROR చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అడంగల్‌లో

Ap News: అక్రమాలకు పాల్పడ్డ తహశీల్దార్, ఇద్దరు ఎస్‌ఐలపై కేసు
తహశీల్దార్, ఇద్దరు ఎస్‌ఐలపై కేసు

అనంతపురం: పుట్లూరు మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌ (MRO)తో పాటు మరో ఇద్దరు ఎస్ఐల (SI)పై కేసు నమోదైంది. ROR చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అడంగల్‌లో పేరు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం (pass book) జారీ చేశారంటూ కడవకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కోర్టు(court)ను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో అప్పటి తహశీల్దార్‌గా పనిచేసిన ఎమ్మార్వో (MRO) విజయకుమారి, వీఆర్వో ఎన్. శివప్రసాద్, సహకరించిన ఎస్సైలు వెంకట ప్రసాద్, మోహన్ కుమార్ గౌడ్‌లపై కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తహశీల్దార్, వీఆర్వో‌(vro)తో పాటు ప్రమేయం ఉన్న ఎస్ఐలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పుట్లూరు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-31T15:51:09+05:30 IST