అనంతపురంలో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2022-05-02T14:49:30+05:30 IST
జిల్లాలోని రాయదుర్గంలో అర్ధరాత్రి దొంగలు హాల్చల్ చేశారు.
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో అర్ధరాత్రి దొంగలు హాల్చల్ చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి దొంగతనం చేసేందుకు యత్నించారు. దబ్బడి కాంప్లెక్స్ వద్ద ముసుగులు ధరించి బొలెరోలో వచ్చిన దుండగులను ఓ యువకుడు ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన దొంగలు మద్యం సీసాలతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగలు వచ్చిన వాహనాన్ని వెంబడించారు. బళ్లారి రోడ్డు కుంటిమారెమ్మ గుడి సమీపాన బొలెరోను వదిలేసి దొంగలు పరారైయ్యారు. పందుల దొంగతనానికి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.