AP: హంద్రీనీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-02-20T16:22:44+05:30 IST

జిల్లాలోని ఉరవకొండలో హంద్రీ నీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

AP: హంద్రీనీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల ఉక్కుపాదం

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో హంద్రీ నీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ గ్రామాల వారిగా రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేసింది. సంఘ విద్రోహ శక్తులు చొరబడి హింస చెలరేగే అవకాశముందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం ఉన్నందున ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలకు హాజరు కాకూడదని హెచ్చరించారు. ఉరవకొండ హంద్రీ నీవా కాలువ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హంద్రీనీవా నీటి కోసం రైతులు గత వారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితి నెలకొంది. పోలీసులను ఉపయోగించి ఉద్యమాన్ని అణిచివేయడంపై రైతులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-20T16:22:44+05:30 IST