టెట్కు 2,219 మంది గైర్హాజరు
ABN , First Publish Date - 2022-08-07T05:17:52+05:30 IST
అనంతపురం జిల్లాలో శనివారం టెట్కు 2219 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
అనంతపురం విద్య, ఆగస్టు 6 : అనంతపురం జిల్లాలో శనివారం టెట్కు 2219 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో 7 కేంద్రాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒక కేంద్రం, బెంగళూరులో 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 2213 మందికి గాను 1229 మంది హాజరు కాగా 984 మంది గైర్హాజర య్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 2979మందికిగాను 1744 మంది హాజరయ్యారు. 1235 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
ఇంటర్లో..ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 12,620 మందికిగాను 12,185 మంది హాజరు కాగా 435 మంది గైర్హాజరయ్యారు. అధికారులు 29 కేంద్రాలను తనిఖీ చేశారు. సెకెండ్ ఇయర్ పరీక్షలకు 6448మందికి గాను 6245 మంది హాజరు కాగా 203 మంది గైర్హాజరయ్యారు. అధికారులు 36 కేంద్రాలను తనిఖీ చేశారు.
ఓపెన్ పరీక్షల్లో.. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 1477 మంది విద్యార్థులకు గాను 1060 మంది హాజరు కాగా 417 మంది గైర్హాజరయ్యారు. పదో తరగతి పరీక్షల్లో 1166 మందికిగాను 778 మంది హాజరు కాగా 388 మంది గైర్హాజరయ్యారు.