Vikarabadలో రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-11T14:42:42+05:30 IST
జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైకును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా...మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై ఉన్నవారు తాండూరుకు చెందినవారుగా గుర్తించారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.