పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-11-21T05:32:53+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి
అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు

  • బీజేపీ జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాసంక్షేమం దృష్ట్యా  కేంద్ర ప్రభుత్వం పెంట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించదన్నారు. కేంద్రానికి ఆర్థిక భారమైనా ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. అదనపు కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వై.శ్రీధర్‌, గోవర్దన్‌గౌడ్‌, కొమరయ్య, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-11-21T05:32:53+05:30 IST