రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-10-22T05:24:55+05:30 IST
రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

ధారూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలైన సంఘటన ధారూరు సమీపంలోని ఆశాపుర ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి పెద్దేముల్ మండలం మంబాపూర్ వస్తున్న కారు, తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో కారు ఎదురెదురుగా వస్తూ ధారూరు సమీపంలోని ఆశాపుర ఫ్యాక్టరీ వద్ద ఢీకొన్నాయి. ఈప్రమాదంలో రెండు కార్లలో ఉన్న మంబాపూర్ గ్రామానికి చెందిన అనిల్, జయరాంతాండకు చెందిన వినోద్ రాథోడ్, తాండూర్కు చెందిన కిషన్ గోపాల్లకు తీవ్రగాయాలయ్యాయి. రుక్మాపూర్కు చెందిన నరేష్, నారా శ్రీకాంత్లకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని పోలీసులు అంబులెన్స్లో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు అతివేగంగా ఢీకొనడంతో ఓ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మరో కారు రోడ్డు పక్కన తలకిందులుగా పల్టీ కొట్టింది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.