పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని..
ABN , First Publish Date - 2021-10-29T04:59:33+05:30 IST
పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని..

- దళిత దంపతుల ఆత్మహత్యాయత్నం
పరిగి: తరతరాలుగా అనుభవిస్తున్న తమ భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని దళిత దంపతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 61లో గల 4.18 ఎకరాల భూమిని 1960 సంవత్సరంలో వీరప్ప నుంచి అదే గ్రామానికి చెందిన లచ్చయ్య కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి లచ్చయ్య కొడుకు జంగయ్య పంటసాగు చేస్తున్నారు. భూమికి సంబంధించి వీరప్ప మనుమళ్లు మల్లేశ్, గణేశ్ల పేరిట పట్టాపుస్తకాలు వచ్చాయి. ఏళ్ల కాలంగా సాగులో చేస్తుండగా, పట్టాపుస్తకాలు వారికి రావ డం ఏమిటని జంగయ్య, అతని కొడుకు గణేశ్ వాపోతున్నారు. తమ భూమికి సంబంధించి కొత్త పట్టాపాసుపుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యాలయ సిబ్బంది వారికి నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో ఎస్ఐ రమేశ్ అక్కడికి వచ్చి వారిని స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయంమై తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డిను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.